అర్ధగిరి పుష్కరణి


                                  అరగొండ అర్ధగిరి సంజీవరాయ పుష్కరణి

కాణిపాకం కు 12 కీ.మీ దూరంలో అరగొండ సమీపంలోని అర్ధ గిరిలో `సంజీవరాయ పుష్కరణి వుంది. అర్ధగిరి కొండఫై భాగమున గల పుష్కరణిలో నీటిని సేవించిన సర్వ రోగములు తొలగును అని ప్రజల విశ్వాసం.40 రోజుల నీటిని సేవిస్తూ అక్కడ గల ఆంజనేయస్వామిని దర్శించి నిద్రిస్తే ఎటువంటి చర్మవ్యాధి అయినా నయమైపోతుంది. త్రేతాయుగంలో రామరావణ యుద్ధం సమయంలో మూర్చ పోయిన లక్ష్మణుడుని కోలుకొనేటట్లు చేయడానికి ఆంజనేయుడు తీసుకువస్తున్న సంజీవి పర్వతంలో కొంత భాగం ఇక్కడ పడిందని,ఆ భాగమే అరకొండయని,అందుచేతనే ఇక్కడి పుష్కరిణి నీరు సర్వరోగ నివారిణి అయిoదని విశ్వాసం.ఈ క్షేత్ర అభివృద్దికి ఈ గ్రామా ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు తోడ్పడుతున్నారు

No comments:

Post a Comment